ప్రజాభవన్​గా మారిన తర్వాతే అడుగుపెట్టా : కోదండరాం

ప్రజాభవన్​గా మారిన తర్వాతే అడుగుపెట్టా : కోదండరాం

ఖైరతాబాద్, వెలుగు : తెలంగాణ ఉద్యమంలో పీఎంపీ, ఆర్ఎంపీ డాక్టర్లు ప్రముఖ పాత్ర పోషించారని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూ ప్రగతిభవన్​కు పోలేదని, ప్రజాభవన్ గా మారిన తర్వాత ఇటీవల అడుగు పెట్టానని తెలిపారు.  మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ల  డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

పీఎంపీలు గుర్తింపు కావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం దృష్టికి  తీసుకెళ్తానని హామీఇచ్చారు. గ్రామాల్లో అందరికీ వైద్యం అందాలంటే ఒక సంస్థ ఉండాలన్నారు. పీఎంపీలు అందుబాటులో ఉంటే ప్రజలు ప్రథమ చికిత్స పొందేందుకు సులభమవుతుందని పేర్కొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్, సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.