విత్తన ధ్రువీకరణ సంస్థకు డిపార్ట్మెంటల్ హోదా కల్పించాలి : ప్రొఫెసర్ కోదండరామ్

విత్తన ధ్రువీకరణ సంస్థకు డిపార్ట్మెంటల్ హోదా కల్పించాలి : ప్రొఫెసర్ కోదండరామ్

హైదరాబాద్, వెలుగు: విత్తన ధ్రువీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం అందుతుందని టీజేఎస్​ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఇందుకోసం సంస్థకు డిపార్ట్​మెంటల్ హోదా కల్పించి, ట్రెజరీ నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని కోరారుశనివారం హైదరాబాద్​లోని సీడ్​ సర్టిఫికేషన్​ సంస్థ కేంద్ర కార్యాలయంలో  నిర్వహించిన ‘విత్తన ధ్రువీకరణ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం’ లో ఆయన మాట్లాడారు. తెలిపారు. డిపార్ట్​మెంటల్ హోదా కల్పిస్తే సంస్థ ఆర్థిక సమస్యల నుంచి బయటపడి, రైతులకు సర్టిఫైడ్ విత్తనాలు అందించగలదని అన్నారు.