- సీపీజీ సేవలను ప్రారంభించిన సీపీ స్టీఫెన్ రవీంద్ర
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ రక్షణకు, టెర్రరిస్టు దాడులను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సైబరాబాద్ ప్రొటెక్షన్ గ్రూప్(సీపీజీ) సేవలను శనివారం సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సీపీజీ గ్రూప్కు గచ్చిబౌలిలోని కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో స్పెషల్ ఎక్విప్మెంట్ అందజేశారు. సీపీ మాట్లాడుతూ.. సీపీజీలు లా అండ్ ఆర్డర్ సమస్యలు, డిజాస్టర్స్ వచ్చినప్పుడు పోలీసు, క్రైమ్స్ సిబ్బందితో కలిసి పనిచేస్తారన్నారు. వీరికి 2 నెలల పాటు ట్యాక్టికల్, డీఆర్ఎఫ్, డిఫెన్సివ్ టెక్నిక్పై, టెర్రరిస్టు దాడులను అడ్డుకుని జనాల ప్రాణాలను కాపాడే విధంగా ట్రైనింగ్ ఇచ్చామన్నారు.
థియేటర్ల లైసెన్స్ రెన్యూవల్ తప్పనిసరి
రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన సినిమా థియేటర్ల ఓనర్లు,అధికారులతో సీపీ రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. థియేటర్ల లైసెన్స్లను రెన్యూవల్ చేయించుకోవాలని.. సరైన సేఫ్టీ మెజర్ మెంట్స్ పాటించాలని ఓనర్లకు సూచించారు. లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.