టెర్రర్ ఎటాక్ పై దేశవ్యాప్తంగా నిరసనలు

టెర్రర్ ఎటాక్ పై దేశవ్యాప్తంగా నిరసనలు

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాద దాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనాసాగుతున్నాయి. వారనాసిలో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా ఆందోళకు దిగారు పలువురు స్థానికులు. మసూద్ అజార్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న వారికి ప్రభుత్వం తగిన బుద్ది చెప్పాలన్నారు.

ఉగ్రదాడికి నిరసనగా జమ్ము చాంబర్ ఆఫ్ కామర్స్….బంద్ కు పిలుపునిచ్చింది. అటు టెర్రర్ అటాక్ ను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదం పై పోరాటంలో భారత్ కు సహకారం కొనసాగుతుంది అని యూఎస్ తెలిపింది.