షాద్ నగర్లో ఉద్రిక్తత.. నిందితులను ఉరి తీయాలంటూ ఆందోళన

షాద్ నగర్లో ఉద్రిక్తత.. నిందితులను ఉరి తీయాలంటూ ఆందోళన

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను ఉరితీయాలంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రజా సంఘాలు, స్థానికులు అక్కడికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి  నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కాస్త ఉద్రిక్తత నెలకొంది.  ప్రస్తుతం  షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితులను కాసేపట్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తరలించనున్నారు.  అటు తిరుపతిలోనూ విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రియాంక హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.