
-
బోనాల చెక్కుల పంపిణీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల తోపులాట
-
కింద కూర్చొని నిరసన తెలిపిన మాజీ మంత్రి సబిత
-
ఖిల్లా మైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: మహేశ్వరం ఖిల్లా మైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రంగారెడ్డి జిల్లా ఎన్టీఆర్ నగర్ లోని ఆర్కేపురం డివిజన్లో బోనాల చెక్కులను పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ స్థానిక ఇన్చార్జ్ కిచ్చనగారి లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్) హాజరయ్యారు. అయితే స్టేజీపైకి రావాలని ఆలయ ఈవో కేఎల్ఆర్ని పిలిచారు. దీనిపై సబితా అభ్యంతరం వ్యక్తంచేశారు.
ప్రొటోకాల్ ప్రకారం కేవలం లబ్ధిదారులే వేదికపైకి రావాలని అక్కడే కింద కూర్చొని నిరసన తెలిపారు. అతనికి ప్రొటోకాల్ లేదు అని.. ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన వారిని కూడా స్టేజీపైకి రానివ్వొద్దని ఆందోళనకు దిగారు. కేఎల్ఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.