డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ పట్ల గర్వంగా ఉంది

డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ పట్ల గర్వంగా ఉంది

దేశంలోని డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ పట్ల గర్వంగా ఉందన్నారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. కరోనా టైమ్  డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ తమ ప్రాణాలను  లెక్కచేయకుండా సేవలందించారని చెప్పారు. బెంగళూరులోని రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీ కాన్వొకేషన్ లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ యూనివర్సిటీ 2లక్షల మంది డాక్టర్లు, నర్సులను తయారు చేసిందన్న విషయం తనకు సంతోషం కలిగిస్తోందన్నారు రాష్ట్రపతి.