సివిల్స్ ప్రిలిమ్స్ ముగిసిన వెంటనే ప్రొవిజనల్‌‌‌‌ ఆన్సర్ కీ.. సుప్రీంకోర్టుకు యూపీఎస్సీ వెల్లడి

సివిల్స్ ప్రిలిమ్స్ ముగిసిన వెంటనే ప్రొవిజనల్‌‌‌‌ ఆన్సర్ కీ.. సుప్రీంకోర్టుకు యూపీఎస్సీ వెల్లడి

న్యూఢిల్లీ: సివిల్స్ ​ప్రిలిమ్స్​ ముగిసిన వెంటనే ఇకనుంచి ప్రొవిజనల్‌‌‌‌ ఆన్సర్​ కీ విడుదల చేయాలని యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​(యూపీఎస్సీ) నిర్ణయించింది. పరీక్షల పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. 

ఈ మేరకు అఫిడవిట్‌‌‌‌ దాఖలు చేసింది.  ప్రస్తుతం అన్ని పరీక్షల ప్రక్రియ పూర్తయ్యే వరకు యూపీఎస్సీ ఎలాంటి కీ విడుదల చేయడంలేదు. అన్ని పరీక్షలు ముగిశాకే ఫైనల్​ కీని రిలీజ్​చేస్తున్నది.  దీన్ని సవాలు చేస్తూ కొందరు క్యాండిడేట్లు సుప్రీంకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు.

 దీనికి ప్రతిస్పందనగా సుప్రీంకోర్టు ముందు యూపీఎస్సీ కౌంటర్​అఫిడవిట్​ దాఖలు చేసింది. ప్రిలిమ్స్​ముగిసిన వెంటనే తాత్కాలిక కీ విడుదల చేసి.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది.