ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో పంజాబ్ సీఎం భేటీ

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో పంజాబ్ సీఎం భేటీ

ప్రగతి భవన్ లో  సీఎం కేసీఆర్ తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ అయ్యారు. పలు కార్యక్రమాల కోసం ఇవాళ హైదరాబాద్ కు వచ్చిన భగవంత్ మాన్  రెండు రాష్ట్రాల పరిస్థితులు,  దేశ రాజకీయాలపై ప్రగతిభవన్​లో చర్చించే అవకాశం ఉంది.

టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత దేశ వ్యాప్తంగా దూకుడు పెంచాలని భావిస్తున్న కేసీఆర్ పంజాబ్ ముఖ్యమంత్రితో చర్చించాల్సిన విషయాలను చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్న ఎంపీలు, జాతీయ స్థాయిలో సంబంధాలున్న వారి సూచనల మేరకు బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సన్నాహాలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల కథనం.