ప్రధానిని కలిసిన పంజాబ్ సీఎం

ప్రధానిని కలిసిన పంజాబ్ సీఎం

న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీకి వెళ్లిన ఆయన.. మోడీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. భక్రా బీస్ మేనేజ్మెంట్ బోర్డులో కీలక పదవుల భర్తీతో పాటు రూరల్ డెవలప్మెంట్ ఫండ్, గోధుమల సేకరణకు క్యాష్ క్రెడిట్ లిమిట్ తదితర అంశాలు భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. నరేంద్రమోడీతో భేటీ అనంతరం భగవంత్ మాన్ ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో సమావేశం కానున్నట్లు సమాచారం.

For more news..

మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్

టీఆర్ఎస్ ఆందోళనలు చేయడం సిగ్గుచేటు