టీఆర్ఎస్ ఆందోళనలు చేయడం సిగ్గుచేటు

టీఆర్ఎస్ ఆందోళనలు చేయడం సిగ్గుచేటు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం  చేశారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పేదల దగ్గర నుంచి మధ్యతరగతి వరకు ఎవ్వరినీ టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని మండిపడ్డారు.విద్యుత్ ఛార్జీల పెంపుతో అందరికీ ప్రభుత్వం షాక్ ఇచ్చిందన్నారు.ఇటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, గ్యాస్,పెట్రోల్ వాతలు పెడుతోందన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా పెట్రోల్ ధరల పెరుగుదలపై టీఆర్ఎస్ ఆందోళనలు చేయడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ గద్దె దిగడం ఖాయమన్న అర్థం వచ్చేలా బై బై కేసీఆర్ అంటూ  రేవంత్ ట్విట్టర్ లో హాష్ ట్యాగ్ జత చేశారు. 

మరిన్ని వార్తల కోసం

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

నువ్వా–నేనా!: అంబానీ–అదానీల మధ్య ముదురుతున్న పోటీ