మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు సీఎం కేసీఆర్. కుటుంబసభ్యులతో కొల్హాపూర్ కు చేరుకున్న ముఖ్యమంత్రికి ఎయిర్ పోర్టులో అధికారులు స్వాగతం పలికారు. తర్వాత మహాలక్ష్మీ అంబాబాయి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి.. అమ్మవారి అలంకార పూజలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. ఆయనకు వేద ఆశీర్వచనం చేసి..తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు.
మరిన్ని వార్తల కోసం: