కాంగ్రెస్​లోకి పురాణం సతీశ్

కాంగ్రెస్​లోకి పురాణం సతీశ్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ నేత, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​ కాంగ్రెస్​ పార్టీలో చేరారు. శనివారం ఉదయం కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్​ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్​ తదితరులు పాల్గొన్నారు.