హైదరాబాద్, వెలుగు : ఇండి యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ ఇన్క్యుబేట్ చేసిన ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ టూ వీలర్లు వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్నా యి. ఇండియామార్కెట్ కు తగిన ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం 18 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్యూర్ ఈవీ నెలకొల్పింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 10 వేల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టు కున్నట్లు కంపెనీ తెలిపింది. హై పెర్ ఫార్మెన్స్ లిథియం బ్యాటరీలు తయారు చేసే ప్యూర్ ఎనర్జీనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ప్యూర్ ఈవీని ప్రత్యేక విభాగంగా నెలకొల్పింది.
