మైనర్ బాలికపై రెండేళ్లుగా స్వామీజీ అత్యాచారం.!

మైనర్ బాలికపై  రెండేళ్లుగా స్వామీజీ అత్యాచారం.!

ఏపీలో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో  పూర్ణానంద స్వామిజీ  అరెస్ట్ అయ్యారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.  వెంకోజిపాలెం వద్ద ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చాలా ఏళ్ల నుంచి ఉంటున్న బాలిక.. తనపై రెండేళ్లుగా స్వామిజీ అత్యాచారం చేశారని  పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీడబ్ల్యూసీకి ఇచ్చిన ఫిర్యాదుతో దిశ పోలీసులు రంగంలోకి దిగి జూన్ 19న రాత్రి స్వామీజీ పూర్ణానందను  అరెస్ట్ చేశారు.

విశాఖలోని జ్ఞానానంద  ఆశ్రమంలో రాత్రి తనిఖీల్లో ప్రాథమిక ఆధారాలు లభించాయని పోలీసులు చెప్పారు. పూర్ణానంద బాలికతో ఆవులకు మేతవేయడం, పేడతీయడం వంటి పనులు చేయించేవారని తెలుస్తోంది.    పూర్ణానంద స్వామి బాలికను బంధించిన పగలంతా సేవలు చేయించుకుని రాత్రి లైంగిక దాడికి పాల్పడినట్లు  బాలిక  ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు వెల్లడించారు.   చాలా రోజులుగా తన ఆశ్రమ భూములను  కొట్టేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని..అందులో భాగంగానే తనపై కుట్ర చేసి ఈ అత్యాచార ఆరోపణలు చేస్తున్నారని పూర్ణానంద చెబుతున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానంటున్నారు.