ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పుష్ప సినిమా సీన్ రిపీట్

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పుష్ప సినిమా సీన్ రిపీట్

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 'పుష్ప' సినిమా సీన్ రిపీట్ అయింది. ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు పోలీసులు చుక్కలు చూపించారు. చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యాన్ ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు. స్మగ్లర్లు తప్పించుకునేందుకు గంజాయి మూటలను రోడ్డుకు అడ్డంగా వేసినా పోలీసులు వెనక్కి తగ్గలేదు.  

ఇక విసుగు చెందిన దుండగులు మార్గ మధ్యలో బొలెరో వాహనం వదిలేసి పరార్‌ అయ్యారు.  రూ.కోటి విలువైన గంజాయిని సీజ్ చేశారు. ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని ఏపీలోకి త‌ర‌లిస్తున్నట్లు పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.