న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ ఇండియాకు చేరుకున్నారు. గురువారం (డిసెంబర్ 4) రష్యా నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎయిర్ పోర్టులో పుతిన్కు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన కోసం ఇండియాకు వచ్చిన పుతిన్ శుక్రవారం (డిసెంబర్ 5) జరగనున్న 23వ భారతదేశం-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పుతిన్ పర్యటన సందర్భంగా భారత్-రష్యా మధ్య అణు విద్యుత్ సహా పలు రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత పుతిన్ భారత పర్యటనకు రావడంతో ఈ టూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
