
ఉక్రెయిన్ భూభాగంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అంతా రష్యాదే అని అన్నారు. రష్యన్ సైనికుడు ఎక్కడ అడుగు పెడితే అది రష్యాదే అని ప్రకటించారు. ఉక్రెయిన్ లొంగిపోవాలని కోరుకోవడం లేదని.. రష్యా టెరిటోరియల్ ఉద్దేశాలను అంగీకరించాలని స్పష్టం చేశారు. రష్యా, ఉక్రెనియన్లు ప్రజలు ఒకటేనని.. ఉక్రెయిన్ అంతా రష్యాదేనని చెప్పారు పుతిన్.
శుక్రవారం(జూన్ 20, 2025న) సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ భూభాగం గురించి రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. రష్యన్లు ,ఉక్రేనియన్లు "ఒకే ప్రజలు" అని "ఆ కోణంలో ఉక్రెయిన్ అంతా మనదే" అని అన్నారాయన.
ALSO READ | ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. ఆ విషయంలో భారత సాయం కోరిన నేపాల్, శ్రీలంక..
రష్యా ప్రాదేశిక ఆశయాలను నొక్కి చెప్పడానికి పుతిన్ "రష్యన్ సైనికుడు ఎక్కడ అడుగు పెడితే అది మనదే" అనే రష్యన్ సామెతను ఉపయోగించారు. రష్యా ఉక్రెయిన్ లొంగిపోవాలని కోరుకోవడం లేదని చెబుతూనే కైవ్ భూమిపై వాస్తవాలను అంగీకరించాలని గట్టిగా చెప్పారు. ఇది రష్యా ప్రాదేశిక లాభాలు ,కొన్ని ప్రాంతాలపై నియంత్రణను స్పష్టం చేస్తుంది.
ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంలో జరుగుతున్న దాడిని ప్రస్తావించిన పుతిన్.. రష్యన్ దళాలు బఫర్ జోన్ సృష్టించడానికి ఉక్రెయిన్ భూభాగంలోకి 12 కిలోమీటర్ల వరకు చొచ్చుకుపోయాయని చెప్పారు. సుమీ నగరాన్ని స్వాధీనం చేసుకునే అవకాశాన్ని పుతిన్ తోసిపుచ్చనప్పటికీ అది ప్రస్తుత లక్ష్యం కాదని అన్నారు పుతిన్.
పుతిన్ వ్యాఖ్యలను ఉక్రెయిన్ ,దాని పాశ్చాత్య మిత్రదేశాలు తీవ్రంగా ఖండించాయి. పుతిన్ మాటలు ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని తిరస్కరిస్తున్నాయని, ఉక్రెయిన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలనే రష్యా చిరకాల ఉద్దేశానికి ఇది నిదర్శనం అని ఆరోపిస్తున్నాయి. పుతిన్ ప్రకటనలకు ప్రతిస్పందనగా ఉక్రెయిన్ ప్రపంచ దేశాల సపోర్టును కోరింది. మాస్కోను ఒంటరిగా చేయాలని పిలుపునిచ్చింది.