ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. ఆ విషయంలో భారత సాయం కోరిన నేపాల్, శ్రీలంక..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. ఆ విషయంలో భారత సాయం కోరిన నేపాల్, శ్రీలంక..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై వారం పదిరోజులు కావస్తోంది. వందల మంది చనిపోయారు. భవనాలు కూలిపోయి నగరాలు ఛిద్రమైపోతున్నాయి. ప్రజలు వలస బాట పడుతున్నారు. కానీ ఆ రెండు దేశాలు ఇంకా శాంతిచడం లేదు. యుద్ధం చేసిన గాయాలు భవిష్యత్తును బాధిస్తాయని తెలిసినా.. నేతలు ఏ ఒక్కరూ తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో భారత్ పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక భారత సాయం కోరడం ఆసక్తికర పరిణామం.

యుద్ధం కారణంగా బతుకుతామో లేదో అనే ఆందోళనలో అక్కడ నివసిస్తున్న ప్రజలు ఉన్నారు. అదే సమయంలో ఉన్నత విద్య, ఉపాధి కోసం వెళ్లిన భారత విద్యార్థులు చావు గుప్పిట్లో నుంచి బయటపడ్డారు. భారత ప్రభుత్వం విద్యార్థులను సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చింది. 

ఇరు దేశాలు మిస్సైళ్తో దాడులు చేసుకుంటున్న తరుణంలో ఇరాన్ గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత అభ్యర్థన మేరకు రోడ్డు మార్గానికి అనుమతించింది. అక్కడ ఉన్న మొత్తం విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ విషయంలో భారత ఎంబసీ తీసుకున్న చొరవతో ఇరాన్ అంగీకరించి మార్గాన్ని సులభతరం చేసింది.

►ALSO READ | ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి తప్పు.. భారత్ మౌనం వీడాలి

ఈ క్రమంలో ఇరాన్ లో చిక్కుకున్న తమ విద్యార్థులను కూడా తీసుకురావాల్సిందిగా భారత పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక భారత్ ను కోరినట్లు ఇరాన్ లో భారత ఎంబసీ ప్రకటించింది. ఇరాన్ లో ఉన్న ఆ దేశాలకు చెందిన విద్యార్థులను తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఎంబసీ అధికారులు తెలిపారు. భారత విద్యార్థులతో పాటు శ్రీలంక, నేపాల్ విద్యార్థులను తరలించనున్నట్లు భారత రాయబార కార్యాలయం అధికారులు వెల్లడించారు. 

ఇరాన్ లో ఉన్న విద్యా్ర్థులను తరలించేందుకు ఇండియా ‘ఆపరేషన్ సింధు’ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజు రోజుకూ పెరిగిపోతున్న తరుణంలో ఆపరేషన్ సింధు ద్వారా భారత విద్యార్థులను తరలిస్తోంది. భారత విదేశాంగా శాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 517 మంది భారత విద్యార్థులు తమ స్వదేశానికి సురక్షితంగా చేరుకున్నారు. తుర్కమెనిస్తాన్ లోని అష్గాబత్ నుండి ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో జూన్ 21న విద్యార్థులు న్యూఢిల్లీ చేరుకున్నట్లు విదేశాంగా వెల్లడించింది.