హైదరాబాద్, వెలుగు: చూపులేని వాళ్లకు రోజువారీ జీవితం ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. స్టిక్ పట్టుకుని ఎటైనా వెళ్లినా.. ముందు ఏముందో తెలియని పరిస్థితి. ఏ ముప్పు ఉంటుందో అంచనా వేయడమూ కష్టమే. అలాంటి కష్టాలకు చెక్ పెట్టేలా ఏఐ పవర్డ్ స్టిక్ను తీసుకొచ్చింది క్వాడ్రిక్ఐటీ అనే సంస్థ. సెన్సర్ల ఆధారంగా పనిచేసే ఈ స్టిక్.. దారిలో ఎలాంటి అవాంతరాలున్నాయో వెంటనే అలర్ట్ చేస్తుంది. ఎమర్జెన్సీ పరిస్థితులనూ వెంటనే చెప్పేస్తుంది. వాయిస్ కమాండ్స్ ద్వారా ఈ స్టిక్ను సులభంగా ఆపరేట్ చేసేందుకు వీలుంటుంది.
బ్లూటూత్ కనెక్టెడ్ ఇయర్ పాడ్స్తో నేరుగా స్టిక్తోనే కనెక్ట్ చేసుకునేందుకు వీలుంటుంది. స్టిక్ వాడే యూజర్లకు.. వాయిస్ కమాండ్స్ను ఇచ్చేందుకు ఓ స్పీకర్నూ అటాచ్ చేస్తారు. ప్రస్తుతానికి దీని ప్రొటోటైప్ను అభివృద్ధి చేసిన సంస్థ.. త్వరలోనే పూర్తి స్థాయిలో దానిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.
ఫింగర్ స్కాన్ చేస్తే చాలు.. మన హెల్త్ను చెప్పేస్తది!
ఫింగర్ టిప్లో ఒక బ్లడ్ డ్రాప్తో ఎన్నో రకాల టెస్టులను చేసే రోజులొచ్చేశాయి. అయితే, రక్తపు చుక్క అవసరం లేకుండా.. జస్ట్ మన ఒంట్లోని రక్తాన్ని స్కాన్ చేసి మనకున్న సింప్టమ్స్ను చెప్పేసే యాప్ ఒకటొచ్చింది. యాక్యులీ అనే సంస్థ.. లైఫాస్ అనే యాప్ను తీసుకొచ్చింది. దానికి కావాల్సిందల్లా ఓ స్మార్ట్ఫోన్, ఈ లైఫాస్ అనే యాప్. యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత.. ఫోన్ బ్యాక్ కెమెరాతో మన చూపుడు వేలిని స్కాన్ చేస్తే.. ఫొటోక్రొమటోగ్రఫీ ద్వారా మన బ్లడ్ను ఆ యాప్ స్కాన్ చేసి మనలోని సింప్టమ్స్ను పసిగట్టేస్తుంది.
హిమోగ్లోబిన్ స్థాయులు, హార్ట్రేట్, గుండె ఆరోగ్యం, లివర్ హెల్త్, మజిల్ హెల్త్, ఊపిరితిత్తుల ఆరోగ్యం, మెంటల్ హెల్త్ ఎలా ఉందో పసిగడుతుంది. 93.8 శాతం కచ్చితత్వంతో ఈ యాప్ పనిచేస్తుందని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే, ఇది ఫ్రీ కాదు. నెలలో ఓ రెండు మూడు టెస్టులు చేసుకోవాలంటే రూ.500 కట్టాల్సిందే.
