సూపరో సూపర్ : జస్ట్ రూ.10 వేలకే 5G ఫోన్.. త్వరలోనే వచ్చేస్తోంది..!

సూపరో సూపర్ : జస్ట్ రూ.10 వేలకే 5G ఫోన్.. త్వరలోనే వచ్చేస్తోంది..!

జియో అభిమానులకు శుభవార్త..  త్వరలో రిలయన్స్ జియో రూ. 10వేల లోపు ధరలో 5జీ ఫోన్ ను లాంఛ్ చేయనుంది.  జియోతో కలిసి క్వాల్‌కామ్ చిప్‌సెట్ కంపెనీ ఈ కొత్త జియో 5జీ ఫోన్ అభివృద్ధి చేస్తోంది. క్వాల్‌కామ్ చిప్ సెట్‌తో జియో ఫోన్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2024 చివరి నాటికి ఈ ఫోన్ లాంచ్ అవుతుందని తెలుస్తోంది. స్పెయిన్ బార్సిలోనాలో జరిగిన వరల్డ్ మొబైల్ కాంగ్రెస్-2024లో ఈ విషయాన్ని వెల్లడించారు. 

దేశంలో 5జీ నెట్‌వర్క్‌ని విస్తృతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రియలన్స్‌ ఈ దిశగా అడుగులు వేస్తోంది. తమ నిర్ణయంతో భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 280 కోట్ల మంది ప్రజలకు 5జీ సేవలు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జియో, క్వాల్ కామ్ చెబుతున్నాయి. భారత మార్కెట్లోని మిలియన్ల మంది 2జీ వినియోగదారులను నేరుగా 5జీ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌లకు అందించడానికి కొత్త చిప్‌సెట్ సాయపడుతుందని క్వాల్‌కామ్ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడుతున్నారు.