
హైదరాబాద్, వెలుగు: క్వాంటం వ్యాలీ టెక్ పార్క్లో దేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ను మోహరించడానికి ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతులు కలిపాయి. ఈ టెక్ పార్క్ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేశారు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐబీఎంతో కలసి క్వాంటం అల్గోరిథం అప్లికేషన్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి, మనదేశ క్వాంటమ్ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది. ఈ భాగస్వామ్యం వల్ల టీసీఎస్ పరిశోధకులకు, భారతీయ పరిశ్రమలోని నిపుణులకు, విద్యాసంస్థలకు ఐబీఎం క్వాంటం కంప్యూటర్లను ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది.