- సొంత ఖర్చులతో సెంటర్లో ఉండాలె
- మరో వారం రోజులు ఇంట్లో క్వారంటైన్
- ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లను
రెగ్యులర్గా శానిటైజ్ చేయాలని ఆదేశం - నేటి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ ప్రారంభం
విదేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లు ఇకపై వారం పాటు క్వారంటైన్ సెంటర్లో ఉంటే సరిపోతుందని, మరో వారం హోం క్వారంటైన్లో ఉండాలని సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. క్వారంటైన్ సెంటర్లో ఉండడానికి అయిన ఖర్చులను ఎవరికి వారే భరించాలని పేర్కొంది. గమ్యం చేరాక 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంటానని ఫ్లైట్ ఎక్కడానికి ముందే ప్యాసింజర్ సెల్ఫ్ డిక్లరేషన్ఇవ్వాలని తెలిపింది. ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని, ప్యాసింజర్స్ టెంపరేచర్ను టెస్ట్ చేయాలని ఆదేశించింది. సోమవారం నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్, జూన్ 1 నుంచి 100 రైళ్లు ప్రారంభం కానున్నందున సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ తాజాగా ఆదివారం గైడ్లైన్స్ విడుదల చేసింది.
ఇవీ గైడ్లైన్స్
ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్ కంపల్సరీ.
ఆరోగ్య సేతు యాప్ను ప్యాసింజర్స్ తమ స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలి.
కరోనా లక్షణాలు లేని ప్యాసింజర్స్ను మాత్రమే అనుమతించాలి.
ప్యాసింజర్స్కు ‘ఏవి చేయాలి.. ఏవి చేయకూడదు..’ అనే వివరాలను టికెట్లతోపాటు ట్రావెల్ ఏజెన్సీలు ముంద్రించి ఇవ్వాలి. కొవిడ్ –19 నివారణపై ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ప్రకటనలు డిస్ప్లే చేయాలి. వాటిని ప్యాసింజర్స్ పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రతి ప్యాసింజర్ తప్పనిసరిగా ఫేస్ మాస్కు ధరించాలి. హ్యాండ్స్ను శానిటైజ్ చేసుకోవాలి. డిస్టెన్సింగ్ను పాటించాలి.
ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల ను రెగ్యులర్గా శానిటైజ్/ డిస్ఇన్ఫెక్టెడ్ చేయాలి. ప్యాసింజర్స్ కోసం సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
ప్రయాణం ముగించుకొని దిగినవాళ్లలో 14 రోజుల్లో లక్షణాలు బయటపడితే డిస్ట్రిక్ సర్వైలైన్స్ ఆఫీసర్, స్టేట్/నేషనల్ కాల్ సెంటర్ 1075కు సమాచారమివ్వాలి.
ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు కరోనా లక్షణాలు బయటపడితే.. సమీపంలోని ఐసోలేషన్ సౌలతు ఉన్న హాస్పిటల్కు తరలించాలి. వాళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే.. కొవిడ్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయాలి.
మైల్డ్ సింప్టమ్స్ ఉంటే హోం ఐసోలేషన్ గానీ, కొవిడ్ కేర్ ఐసోలేషన్ సెంటర్లో గానీ.. ప్యాసింజర్స్కే ఆప్షన్ ఇవ్వాలి.
కరోనా లక్షణాలు ఉన్నవాళ్లలో పాజిటివ్ అని తేలితే.. కొవిడ్ హాస్పిటల్స్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. నెగెటివ్ అని తేలితే ఇంటికెళ్లేందుకు అనుమతిం చొచ్చు. అలాంటివాళ్లు వారంపాటు హోం ఐసోలేష న్లో ఉండాల్సిందే. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని 1075 కాల్ సెంటర్కు గానీ సమాచారం అందించాలి.
స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలు క్వారం టైన్/ఐసోలేషన్కు సంబంధించి సొంత ప్రొటోకాల్ను డెవలప్ చేసుకోవచ్చు.
సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి
ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ పాటించాల్సిన గైడ్లైన్స్ను కూడా సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ విడుదల చేసింది. ఆగస్టుకు ముందే ఇంటర్నేషనల్ విమానాలను ప్రారంభించేందుకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏర్పాట్లు చేస్తున్నందున ఈ గైడ్లైన్స్ విడుదలయ్యాయి. కరోనా లక్షణాలు లేని ప్యాసింజర్స్ను మాత్రమే అనుమతించాల్సి ఉంటుందని, అయితే.. ప్యాసింజర్ తప్పనిసరిగా తాను 7 రోజులు క్వారంటైన్ సెంటర్లలో సొంత ఖర్చులతో, మరో 7 రోజులు హోం క్వారంటైన్లో (14రోజులు) ఉంటానని సెల్ఫ్ డిక్లరేషన్ను బోర్డింగ్కు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. గర్భిణులు, ఇంట్లో ఎవరైనా చనిపోతే వచ్చేవాళ్లు, పదేండ్లలోపు పిల్లలకు, ప్రత్యేక కారణాలతో వచ్చినవారికి మాత్రం 14 రోజుల హోం క్వారంటైన్కు అనుమతించొచ్చని మినిస్ట్రీ స్పష్టంచేసింది. ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ తప్పకుండా ఆరోగ్య సేతు యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలని, అందులో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అందుబాటులో ఉంటుందని సూచించింది. ప్యాసింజర్స్ రాకపోకల టైంలో తప్పకుండా థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. వైరస్ లక్షణాలు బయటపడితే.. వెంటనే ఐసోలేషన్కు తరలించాల్సి ఉంటుంది.