అత్యంత పకడ్బందీగా ఉంచాల్సిన టెన్త్ పరీక్ష ప్రశ్నాపత్రాలను కరీంనగర్ జిల్లా ఆఫీసర్లు ఇలా కలెక్టరేట్ కారిడార్ లోకి తీసుకొచ్చారు. కలెక్టరేట్ లో మెయిన్ గేట్లో నుంచి ఎంటర్ కాగానే ఉండే ఓపెన్ స్పేస్ లో క్వశ్చన్ పేపర్ బండిళ్లను పరిచి అజాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తూ శనివారం ‘వెలుగు’ కెమెరాకు చిక్కారు. అటుగా వచ్చి వెళ్లేవారు ఒక్క కవర్ పట్టుకెళ్లినా, క్వశ్చన్ పేపర్ లీకేజీ జరిగినా పరిస్థితి ఏమిటనే విమర్శలు వస్తున్నాయి.- కరీంనగర్, వెలుగు
