దేశ వ్యాప్తంగా బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ఈ మేరకు ఫిబ్రవరి 4, 5, 6 వ తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పార్లమెంట్ లో బీసీ బిల్ ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. చట్ట సభల్లో బీసీ 50 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కల్పించాలన్నారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాలన్నారు. లేదంటే బీసీ ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య.
పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని గత 30 సంవత్సరాలుగా ఢిల్లీ పార్లమెంట్ వంద సార్లు ధర్న చేశామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ బీసీ కులగణన, పార్లమెంటులో బీసీ బిల్లు పెడతామని ప్రకటిస్తుందో ఆ పార్టీకే బీసీలు మద్దతిస్తారని తెలిపారు.