బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలె

బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలె

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యానగర్ లోని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను పెంచడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే అదే విధంగా బీసీల గురించి కూడా సీఎం కేసీఆర్ ఆలోచించాలని కోరారు. నూటికి 50 శాతం జనాభా ఉన్న బీసీలను ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రైవేట్ యూనివర్సటీల్లో బీసీ రిజర్వేషన్లు యదావిధిగా  కొనసాగించాలని, బీసీ గురుకులాలకు సొంత భవనాలు కేటాయించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. దళిత బంధు తరహాలనే బీసీ బంధు ఇవ్వాలన్నారు. జనాభా దామాషా ప్రకారం అభివృద్ధిలో బీసీలకు రావాల్సిన వాటా ఇవ్వాలని, లేకుంటే బీసీలను కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.