రౌడీ షీటర్ల పై పీడియాక్ట్ నమోదు

రౌడీ షీటర్ల పై పీడియాక్ట్ నమోదు

వరుస దొంగతనాలు, దాడులకు పాల్పడుతూ.. ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ఇద్దరు రౌడీ షీటర్ల పై పీడియాక్ట్ నమోదు చేశారు రాచకొండ సీపీ మహేష్ భగవత్.  నేరాలను ప్రవృత్తిగా మార్చుకొని, 2012 నుంచి నేరాలకు పాల్పడుతూ,  జైలు శిక్ష అనుభవించినా మళ్లీ అదే రూటులో వెళుతున్న ఇద్దరు నేరస్తులు మోర్పోజు రవివర్మ, బోదస్ కళ్యాణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరిద్దరిపై వనస్థలిపురం, నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులున్నాయి. హత్య యత్నం కేసుల్లో కూడా వీరు నిందితులుగా ఉన్నారు. శుక్రవారం వీరిపై పీడి యాక్ట్ నమోదు చేసిన సీపి మహేష్ భగవత్.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఎంతటివారైనా శిక్షర్హులేనని అన్నారు.