జ్యోతిష్యం: ఐశ్వర్యం.. అదృష్టం కావాలంటే ....రథసప్తమి రోజు ఏరాశి వారు ఏం చేయాలో తెలుసా..!

జ్యోతిష్యం: ఐశ్వర్యం.. అదృష్టం కావాలంటే ....రథసప్తమి రోజు ఏరాశి వారు ఏం చేయాలో తెలుసా..!

జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలకు రాజు సూర్యుడు.  సూర్యుని సంబంధించిన ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో సూర్యుడి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు.  జాతకంలో సూర్యుడు శుభ దృష్టి ఉంటే  ఐశ్వర్యం.. అదృష్టం కలసి వస్తుందని చెబుతున్నారు.   రథ సప్తమి ( జనవరి 25)   రోజున సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణం వైపు పయనిస్తాడు. ఈ పర్వదినాన చేసే దానధర్మాలు నూటికి నూరు రెట్లు పుణ్యాన్ని ఇస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  మరి ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

రథ సప్తమి అంటే అది మన జీవిత రథాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడానికి చేసే సంకల్పం. సూర్యుడు ఆరోగ్యానికి ఆత్మవిశ్వాసానికి కారకుడు. అందుకే ఈ రోజు చేసే దానాలు కేవలం ఆధ్యాత్మిక ఫలితాలే కాకుండా, మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే జాతకంలో ఉన్న దోషాలను నివృత్తి  చేసుకొనేందుకు ప్రతి రాశి వారు వారిజాతకం ఆధారంగా సూర్యుడు పుట్టిన రోజున.. అంటే రథసప్తమి ( జనవరి 25) కొన్ని వస్తువులను దానం చేయాలని చెబుతున్నారు.

  • మేష రాశి: ఎర్రటి వస్త్రం, శనగలు బెల్లం దానం చేయడం వలన మనం చేసే పనుల్లో స్థిరత్వం కలుగుతుంది.
  • వృషభ రాశి: బియ్యం, పాలు, చక్కెర , తెల్ల నువ్వులు దానం, తెల్ల బట్టలు దానం  చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
  • మిథున రాశి: ఆకుపచ్చని దుస్తులు ,  డబ్బు, పసుపు, పాలు,పెసరపప్పు దానం చేయడం వల్ల ఆర్థిక  సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. 
  • కర్కాటక రాశి: పాలు,  తెల్లని వస్త్రాలు, బియ్యం, వెండి, తెల్ల నువ్వులు  దానం చేయడం వలనమానసిక ప్రశాంతత లభిస్తుంది.
  • సింహ రాశి: ఈ రాశికి  అధిపతి సూర్యుడే కాబట్టి గోధుమలు, తేనే, చిక్కీ, దుప్పట్లు, బెల్లం దానం చేయడం వల్ల సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. 
  • కన్యా రాశి: ఆకుపచ్చ కూరగాయలు .. గోవుకు ఆహారం.. పప్పు ధాన్యాలను దానం చేస్తే ఆరోగ్యానికి మంచిది.
  • తులా రాశి: బియ్యం, తెల్లని వస్త్రాలు, పంచదార,  బియ్యం, దుప్పటి,చక్కెర దానం చేయడం వలన  విలాసవంతమైన సౌకర్యాలు ఏర్పడుతాయి.
  • వృశ్చిక రాశి: వేరుశనగ, బెల్లం,  నువ్వులు,ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం, శత్రు జయం లభిస్తాయి.
  • ధనుస్సు రాశి: పసుపు రంగు వస్త్రాలు ..శనగపిండి,  పప్పు ధాన్యాలను దానం చేస్తే జ్ఞానం, శ్రేయస్సు కలుగుతాయి.
  • మకరరాశి:నల్ల నువ్వులు ..  లడ్డూ, దుప్పట్లు,నల్లని దుప్పటి, నూనె, నల్ల నువ్వులు, ఇనుప వస్తువుల దానం వల్ల శని ప్రభావం తగ్గి సూర్య శక్తి లభిస్తుంది.
  •  కుంభ రాశి: నల్ల నువ్వులు ..నల్లని వస్త్రాలు, తోలు బూట్లు, ఉసిరి పప్పు, కిచిడీ, నువ్వులు, బియ్యం.. శివాలయంలో నువ్వుల నూనె ఇవ్వడం  వల్ల శని ప్రభావం తగ్గి సూర్య శక్తి లభించి అనుకున్న పనులు నెరవేరుతాయి.
  • మీన రాశి: పసుపు ఆవాలు, శనగ పప్పు, వస్త్రాలు, బియ్యం, పప్పు, నువ్వులు, పసుపు పండ్లు ..  పసుపు రంగు దుస్తుల దానం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నతి  పొందుతారు.

ఇంకా ఏమేమి చేయాలంటే

  • తెల్లవారుజామునే నిద్రలేవాలి..
  • జిల్లేడు ఆకులను ( మగవారు )తలపై పెట్టుకొని స్నానం చేయాలి. చిక్కుడు ఆకులను ( ఆడవారు )తలపై పెట్టుకొని స్నానం చేయాలి
  • సూర్యనమస్కారాలు చేయాలి
  • ఆదిత్యహృదయం.. సూర్యాష్టకం పఠించాలి.
  • సూర్యుని ఎదురుగా నిలబడి దోసెలలో నీళ్లు పోసుకొని ఒక రాగి పాత్రలో వదలాలి.  తరువాత ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో చెట్టుకు పోయాలి.. 
  • గోవుకు గోధుమలు ఆహారంగా ఇవ్వాలి.
  • శివాలయాన్ని సందర్శించి.. పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయాలి.

రథ సప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం శ్రేయస్కరం. పైన పేర్కొన్న దానధర్మాలు మీ శక్తి కొలది చేయడం వల్ల మీ జీవితం సుఖసంతోషాలతో నిండుతుంది. ఈ శుభ సమయంలో చేసే భక్తి పూర్వక పనులు మీ జీవిత దిశను మార్చగలవు..

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.