ఆ ముగ్గురిని లైఫ్‌‌లో మర్చిపోలేను: లారెన్స్

ఆ ముగ్గురిని లైఫ్‌‌లో మర్చిపోలేను: లారెన్స్

రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు రూపొందించిన చిత్రం ‘చంద్రముఖి 2’. కంగనా రనౌత్ టైటిల్‌‌ రోల్‌‌ పోషించింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్‌‌గా సెప్టెంబర్ 28న విడుదలవుతోంది. లక్ష్మీ మూవీస్ బ్యానర్‌‌‌‌పై నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. లారెన్స్ మాట్లాడుతూ ‘నేను డ్యాన్స్ కంపోజ్ చేసిన ప్రతీ హీరో అభిమాని నాకు ఫ్యాన్ అయ్యారు. నాకు ఛాన్స్ ఇచ్చిన హీరోలందరికీ థాంక్స్. నా లైఫ్‌‌లో ముగ్గురిని ఎప్పుడూ మరిచిపోను. రజినీ కాంత్ గారు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడ్ని కాదు. మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే మీ అభిమానం నాకు వచ్చేది కాదు. డైరెక్షన్ ఛాన్స్‌‌ ఇచ్చిన నాగార్జున గారిని మరిచిపోలేను. వాసు గారు కథ చెప్పి నన్నే లీడ్ రోల్ చేయమనగానే షాక్ అయ్యా. అలాగే కంగనాతో నటించాలని అందరికీ డ్రీమ్ ఉంటుంది. ఆమె నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. కీరవాణి మ్యూజిక్ సినిమాకు హైలైట్‌‌గా ఉంటుంది’ అన్నాడు. కంగనా రనౌత్ మాట్లాడుతూ ‘ఏక్ నిరంజన్ తర్వాత నేను తెలుగులో నటించిన చిత్రమిదే. ‘చంద్రముఖి 2’ అనే ప్రయాణం నాకు ఎంతో స్పెషల్. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. లారెన్స్ మాస్టర్‌‌‌‌తో మళ్లీ వర్క్ చేయాలని కోరుకుంటున్నా. ఇంత వరకు ఏ హీరోకు కూడా నేను ఇలా చెప్పలేదు. కీరవాణి గారు మా సినిమాకు అతి పెద్ద బలం’ అని చెప్పింది. లారెన్స్ మాస్టర్, కంగనాతో ఈ సినిమా చేయడం హ్యాపీ అన్నారు దర్శకుడు పి.వాసు.  తన శక్తి మేరకు మ్యూజిక్ ఇచ్చానన్నారు కీరవాణి. నటి మహిమా నంబియార్, నిర్మాత ఎన్వీ ప్రసాద్, లిరిక్ రైటర్ చైతన్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.