బీజేపీకి బలం లేకపోతే టీఆర్ఎస్ కు ఉలికిపాటు ఎందుకు

బీజేపీకి బలం లేకపోతే టీఆర్ఎస్ కు ఉలికిపాటు ఎందుకు

దుబ్బాక : మఫ్టీ పోలీసులతో టీఆర్ఎస్ నాటకం ఆడుతోందన్నారు దుబ్బాక బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు. బీజేపీకి కార్యకర్తలే బలమన్నారు. తమ మౌనాన్ని చేతగాని తనంగా తీసుకోవద్దన్నారు. దుబ్బాకలో నేతలను బెదిరిస్తున్నారని.. పించన్లు రావంటూ భయపెడుతున్నారంటూ ఆరోపించారు. సమాచారం లేకుండా తనిఖీలు ఎలా చేస్తారన్నారు రఘునందన్. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని విమర్శించారు రఘునందన్. దుబ్బాకలో జరుగుతున్న గొల్లకుర్మల బహిరంగ సభలో పాల్గొని మాట్లాడిన రఘునందన్..సమాచారం లేకుండా సెర్చింగ్ కు ఎలా వస్తారన్నారు.

సిద్దిపేట సీపీకి చట్టం తెలియదా..మేం దేశద్రోహులమా ? దొంగలమా ? అని ప్రశ్నించారు. హరీశ్ సూచనలతోనే సీపీ పని చేస్తుండన్నారు. సిద్ధిపేట నుంచి దుబ్బాకకు జనాన్ని దింపారని..బీజేపీకి బలం లేకపోతే టీఆర్ఎస్ కు ఉలికిపాటు ఎందుకన్నారు. హరీశ్ మర్యాదగా మాట్లాడితే మంచిదని..మేం మాట్లాడితే రీ సౌండ్ వస్తదన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ నేతలు లేరా..సిద్దిపేట కౌన్సిలర్లు దుబ్బాకకు ఎందుకు వచ్చారన్నారు. నీ అభివృద్ధిపై నీకు నమ్మకం లేదా  అని ప్రశ్నించిన రఘునందన్ ప్రజల్ని స్వేచ్చగా ఓట్లు వెయ్యనివ్వండన్నారు. ఇంట్లో ఒక్క రూపాయి కూడా దొరకలేదని తెలిపిన ఆయన..నిన్న పోలీసులు రౌడీల్లా ప్రవర్తించారన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని..ఇవాళ మీది అధికారం రేపు మాదే అధికారం అన్నారు దుబ్బాక బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు.