మేము దేశానికి బానిసలం..మీ లెక్క కుటుంబానికి కాదు

మేము దేశానికి బానిసలం..మీ లెక్క కుటుంబానికి కాదు

TRS  నేతలు భూకంపం వచ్చినట్టు భయపడుతున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. బండి సంజయ్ యాత్రకు జనాలే కరువయ్యారంటున్న ఆ నాయకులు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన రఘునందన్..గల్లీ పార్టీకి డిల్లీలో పార్టీ ఆఫీసు ఎందుకని ప్రశ్నించారు. మేమిచ్చిన భూమిలో భూమి పూజ ఎందుకు చేస్తున్నారన్నారు. 

సర్దార్ పటేల్ ను గుజరాతి వాడు అనే నీచానికి దిగజారి మాట్లాడుతున్నారన్న రఘునందన్ రావు..తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు కేసీఆర్ సభలోనే లేడన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య  TRS లో చేరినప్పుడు 111 GO పై కేసీఆర్ ఏమి చెప్పారు..111 GO పై కేసీఆర్ స్టాండ్ ఏంటో చెప్పాలన్నారు.

80 శాతం హిందువుల గురుంచి తప్పకుండా మాట్లాడుతామని స్పష్టం చేశారు.పాత బస్తీలో ఖాళీ చేసి వెళ్లిన హిందువుల గురించి మీరు మాట్లాడండి అని అన్నారు రఘునందన్ రావు. హిందువుల గురించి మాట్లాడితే మతతత్వం అని ఎక్కడ ఉందో చెప్పాన్నారు. మేము దేశానికి బానిసలం..మీ లెక్క కుటుంబానికి బానిసలం కాదన్నారు. నిజాం ఆస్తులు ఎక్కడ ఉన్నాయో.. ఎవరు అనుభవిస్తున్నారు తెలియాలన్న రఘునందన్ రావు.. నిజాం ఆస్తులు తెలంగాణ ప్రజలకి దక్కాల్సిందేనన్నారు. భూములు ఎక్కడ ఉన్నాయో ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు.