
తన ఫ్రెండ్స్ మాటలు తప్ప మరేం వినలేరు: రాహుల్
న్యూఢిల్లీ: ‘అగ్నిపథ్’ కింద సాయుధ దళాల్లో షార్ట్ సర్వీస్ రిక్రూట్మెంట్ను నిలిపివేయాలని, నిపుణులతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ మోడీపై ఫైర్ అయ్యారు. తన స్నేహితుల మాటలు తప్ప మరేమీ వినలేని ప్రధాని మోడీకి దేశ ప్రజలకు ఏం కావాలో అర్థం కావడం లేదన్నారు. కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంపై రాహుల్ స్పందించారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. నిరసనలు, ఆందోళనలతో అగ్నిపథ్ను యువకులు వ్యతిరేకిస్తున్నందున దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రధాని మోడీని కోరారు.