
కేంద్రంలోని బీజేపీ సర్కారును విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో, రాష్ట్రాల్లో చెలరేగుతున్న నిరసనలపై స్పందించారు. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ జాతీయ గిరిజన ఉత్సవాల కార్యక్రంలో పాల్గొన్నారు. ఇ సందర్భంగా మాట్లాడిన రాహుల్… దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసన్నారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ మందగమనం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నామని తెలిపారు.తాను చెప్పదలచుకున్నదొక్కటే.. అన్ని జాతులు, మతాలు, తెగల ప్రజలను సమన్వయం చేసుకుంటూ వెళ్లకపోతే దేశాన్ని ముందుకు నడిపించలేమని స్పష్టం చేశారు.
రాయ్ పూర్ లోని సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో ప్రారంభమైన గిరిజనోత్సవాలు మూడు రోజులపాటు జరుగనున్నాయి. ఈ వేడుకల్లో రాహుల్ గాంధీ గిరిజనులతో కలిసి ..చేతిలో డోలు పట్టుకొని వాయిస్తూ వారితో పాటు నృత్యం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణతో పాటు మొత్తం 24 రాష్ట్రాల నుంచి నృత్యకారుల బృందాలు పాల్గొంటున్నాయి.