
- కేంద్రానిది దేశద్రోహమే..
- బార్డర్లో చైనా నిర్మాణాలపై రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఇండియా బార్డర్లో చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదని, ఇది దేశ ద్రోహం కిందికే వస్తుందని కాంగ్రెస్నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ భూభాగాన్ని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, లడఖ్లో చైనా ఆర్మీ , ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేస్తోందని అమెరికా టాప్ జనరల్ తెలియజేసినా నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దాడులకు చైనా పునాదులు వేస్తోందని మండిపడ్డారు. చైనా అక్రమ నిర్మాణాలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆరిందం బాగ్చీ స్పష్టత ఇచ్చారు. తూర్పు లడఖ్లో నెలకొన్న ఇష్యూలపై సొల్యూషన్స్ కోసం భారత్ ప్రభుత్వం చైనాతో చర్చలు జరుపుతోందన్నారు. చైనా ఆర్మీతో చర్చలు ప్రారంభమైతే.. అన్ని సమస్యలపై మాట్లాడతామని చెప్పారు.