చిత్రదుర్గలో రాహుల్ పాదయాత్ర

చిత్రదుర్గలో రాహుల్ పాదయాత్ర

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని చిత్ర దుర్గలో కొనసాగుతోంది. తమిళనాడు, కేరళలో అనంతరం సెప్టెంబర్ 30వ రాహుల్ యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించింది. చల్లకెరె గ్రామం నుంచి ఇవాళ రాహుల్ తన పాదయాత్ర ప్రారంభించారు. పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర ఇప్పటివరకు 905 కిలోమీటర్ల మైలురాయి దాటింది.   

ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర త్వరలోనే తెలంగాణలో ఎంటర్ కానుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. 12 రాష్ట్రల్లో సుమారు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగించనున్న రాహుల్ గాంధీ పాదయాత్ర.. జమ్మూ కశ్మీర్ లో ముగియనుంది.