తెలంగాణలో దొరల సర్కార్ పోయి.. ప్రజల సర్కార్ రావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, నవంబర్ 28వ తేదీ మంగళవారం నాంపల్లిలో రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై ఫైర్ అయ్యారు.
రాహుల్ గాంధీ ప్రంసంగంలో హైలెట్స్:
- తెలంగాణలో దొరల సర్కార్ పోవాలి.
- బీజేపీ ఇచ్చిన లిస్టుతో ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించింది.
- ఏం చేసినా.. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసే చేస్తాయి.
- మోదీ, కేసీఆర్, ఓవైసీలు ఒక్కటే.
- రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోతున్నాయి.
- కేసీఆర్ కు బై బై చెప్పే సమయం వచ్చింది.
- ఢిల్లీలో మోదీని ఓడించాలంటే.. ఇక్కడ కేసీఆర్ ను ఓడించాలి.
- పార్లమెంట్ లో బీజేపీకి అన్ని రకాలుగా బీఆర్ఎస్ సహకరించింది.
- నోట్ల రద్దు, జీఎస్టీలో బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తోంది.
- బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోంది.
- కాంగ్రెస్ నేతలపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయి.
- కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది.
- ఆరు గ్యారంటీలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరుతుంది.
- ప్రతి నెల మహిళ ఖాతాలో రూ.2500 వేస్తాం.
- రూ.500లకే ఇంటి గ్యాస్ సిలిండర్ ఇస్తాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం.
- రైతులకు ఎకరానికి రూ.15వేలు పెట్టుబడి సాయం అందింస్తాం.కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్తాం.
- 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం. ఇళ్లల్లో 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ
- ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా సర్కార్ బడులను తీర్చిదిద్దుతాం.