తమిళ ప్రజల సంస్కృతి, భాష పట్ల నరేంద్రమోడీకి ఏ మాత్రం గౌరవం లేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తమిళ ప్రజలు తన ఆలోచనలకు లోబడి ఉండాలని మోడీ భావిస్తున్నారని చెప్పారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కోయంబత్తూరుకు చేరుకున్న రాహుల్ గాంధీ…రోడ్ షో నిర్వహించారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం తిరుప్పూరులో రోడ్ షో నిర్వహించనున్న రాహుల్… స్వాతంత్ర్య పోరాట యోధుడు తిరుప్పూర్ కుమారన్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తిరుప్పూరు, ఈరోడ్, కరూర్ తో పాటు మొత్తం ఐదు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
Mr Narendra Modi has no respect for the culture, language & people of Tamil Nadu. He thinks that Tamil people, language & culture should be subservient to his ideas & culture: Rahul Gandhi in Coimbatore https://t.co/qbc71R1Vqk pic.twitter.com/OETlIlps9y
— ANI (@ANI) January 23, 2021
see more news