అమేథీ నుంచే రాహుల్ పోటీ కాంగ్రెస్ యూపీ చీఫ్ రాయ్ వెల్లడి

అమేథీ నుంచే రాహుల్ పోటీ  కాంగ్రెస్ యూపీ చీఫ్ రాయ్ వెల్లడి

న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ చీఫ్  అజయ్ రాయ్ తెలిపారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో అమేథీ సహా కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేశారు. అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోగా, వయనాడ్​లో గెలుపొందారు. ఇప్పుడు మరోసారి స్మృతి ఇరానీతో రాహుల్ పోటీ పడనున్నారు. కాగా, ప్రియాంక పోటీపై రాయ్ స్పందిస్తూ.. ‘‘ఆమెకు నచ్చిన చోటు నుంచి పోటీ చేస్తారు. వారణాసి నుంచి పోటీ చేయాలని ప్రియాంక భావిస్తే ఆమె గెలుపు కోసం అందరం కృషి చేస్తాం” అని అన్నారు.