రాహుల్ గాంధీకి పోటీగా మరో ముగ్గురు గాంధీలు

రాహుల్ గాంధీకి పోటీగా మరో ముగ్గురు గాంధీలు

కేరళ:  లోక్ సభ ఎన్నికల్లో పేరును పోలిన అభ్యర్థులు చాలా మంది పోటీ చేస్తున్నారు. ఒకే స్థానం నుంచి సేమ్ నేమ్స్ తో పాటు అదే పేరుకు అటు ఇటుగా ఉన్న అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి పోటీచేస్తున్నారు. గుర్తులు వేరున్నా..అభ్యర్థుల పేర్ల విషయంలో ఓటర్లు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. లోక్ సభ ఎన్నికల్లో రాహుల్.. అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. వయనాడ్ లో రాహుల్ గాంధీకి ప్రత్యర్థులుగా ఇతర పార్టీల నుంచి ముగ్గురు గాంధీ పేరుగల వ్యక్తులు పోటీకి దిగుతున్నారు.  అందులో ఒకరు స్వతంత్ర అభ్యర్థి కేఈ రాహుల్ గాంధీ(33), ఇంకొకరు అగిలా ఇండియా మక్కల్ కజగమ్ పార్టీకి చెందిన కె. రాఘుల్ గాంధీ(30), మూడో వ్యక్తి మరో స్వతంత్ర్య అభ్యర్థి కె.ఎం.శివప్రసాద్ గాంధీ(40) పోటీ చేస్తున్నారు.