
బీహార్ లో ఓట్ల తొలగింపుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పోరాటం ఉధృతం చేస్తోంది..SIR ను వ్యతిరేకిస్తూ బీహార్ లో భారీ పాదయాత్రకు సిద్ధమవుతోంది. ఒన్ మ్యాన్, ఒన్ ఓట్ అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని కాపాడేందుకు ఓటర్ అధికార్ యాత్రను చేపడుతోంది. వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆదివారం (ఆగస్టు17)నుంచి రోహాస్త్ లోని హెహ్రీఆన్ సోన్ లో ఈ యాత్రను ప్రారంభించనున్నారు. 20 జిల్లాల్లో దాదాపు16 రోజులపాటు 1300 కిలోమీటర్లు బీహార్ మొత్తం పర్యటించి సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ముగియనుంది.
రాహుల్ ఓటర్ అధికార్ యాత్ర షెడ్యూల్ ఇదే..
- ఆగస్ట్ 17 - ససారం, డెహ్రీ ఆన్ సోన్ (రోహ్తాస్)
- ఆగస్ట్ 18 - ఔరంగాబాద్, డియో, గురారు
- ఆగస్ట్ 19 - పునామా వజీర్గంజ్, గయా నుండి బార్బిఘా మీదుగా నవాడా
- ఆగస్టు 20 – సెలవు దినం
- ఆగస్ట్ 21 - తీన్ మోహని దుర్గా మందిర్, షేక్పురా నుండి ముంగేర్ వరకు సికంద్రా, జముయి మీదుగా
- ఆగస్టు 22 – చందన్ బాగ్ చౌక్, ముంగేర్ నుండి సుల్తాన్గంజ్ మీదుగా భాగల్పూర్ వరకు
- ఆగస్ట్ 23 - బరారి, కుర్సేలా నుండి కోర్హా & కతిహార్ మీదుగా పూర్నియా వరకు
- ఆగస్ట్ 24 - కుష్కిబాగ్, పూర్నియా నుండి చాందినీ చౌక్, అరారియా మీదుగా నర్పత్గంజ్ వరకు
- ఆగస్టు 25 – సెలవు దినం
- ఆగస్ట్ 26 - హుస్సేన్ చౌక్, సుపాల్ నుండి ఫుల్పరస్, సక్రి, మధుబని మీదుగా దర్భంగా వరకు
- ఆగస్ట్ 27 - గంగ్వారా మహావీర్ స్థాన్, దర్భంగా నుండి ముజఫర్పూర్ మీదుగా సీతామర్హి వరకు
- ఆగస్ట్ 28 - రిగా రోడ్, సీతామర్హి నుండి మోతిహారి మీదుగా పశ్చిమ చంపారన్
- ఆగస్ట్ 29 - బెట్టియా, పశ్చిమ చంపారన్ నుండి గోపాల్గంజ్ మీదుగా సివాన్ వరకు
- ఆగస్ట్ 30 - చాప్రా, సరన్ నుండి అర్రా, భోజ్పూర్
- ఆగస్టు 31 – సెలవు దినం
- సెప్టెంబర్ 1 - పాట్నాలో యాత్ర ముగింపు
ఈ మార్గాల్లో యాత్ర కొనసాగుతుంది.. ఇది కేవలం యాత్రమే కాదు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు చేస్తున్న ఓ ప్రజాఉద్యమం అని రాహుల్ అన్నారు. అందరికీ ఓటు హక్కును బలహీన పర్చే ప్రయత్నం జరుగుతోంది.. దీనిని అందరం వ్యతిరేకించాలి అన్నారాయన. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.