- మహిళా కమిషన్, స్మితా సబర్వాల్ మౌనం ఎందుకు?: రఘునందన్ రావు
హైదరాబాద్, వెలుగు: అధికార పార్టీ ఎమ్మెల్యే లైంగిక వేధింపుల నుంచి తనను రక్షించాలని ఆందోళనలు చేస్తున్న షేజల్ కు రాష్ట్ర సర్కారు న్యాయం చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇక్కడ న్యాయం జరగకపోవడంతో ఆమె పార్లమెంట్ ముందు నిరసన తెలిపిందన్నారు.
మహిళ లంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష అని శనివారం ట్విట్టర్లో ఫైర్ అయ్యారు. ‘పక్క రాష్ట్ర సమస్యల గురించి స్పందించే స్మితా సబర్వాల్కు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి షేజల్ సమస్య కనపడటం లేదా? ఎందుకు మౌనంగా ఉన్నారు’ అని ప్నశ్నిం చారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ట్వీట్కు కేసీఆర్ ఫెయిల్డ్ తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్ను యాడ్ చేశారు.