షేజల్​కు రాష్ట్ర సర్కారు న్యాయం చేయాలె

షేజల్​కు రాష్ట్ర సర్కారు న్యాయం చేయాలె
  • మహిళా కమిషన్, స్మితా సబర్వాల్ మౌనం ఎందుకు?: రఘునందన్ రావు 

హైదరాబాద్, వెలుగు: అధికార పార్టీ ఎమ్మెల్యే లైంగిక వేధింపుల నుంచి తనను రక్షించాలని ఆందోళనలు చేస్తున్న షేజల్ కు రాష్ట్ర సర్కారు న్యాయం చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్​ చేశారు. ఇక్కడ న్యాయం జరగకపోవడంతో ఆమె పార్లమెంట్ ముందు నిరసన తెలిపిందన్నారు. 

మహిళ లంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష అని శనివారం ట్విట్టర్‌‌లో ఫైర్ అయ్యారు. ‘పక్క రాష్ట్ర సమస్యల గురించి స్పందించే స్మితా సబర్వాల్​కు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి షేజల్ సమస్య కనపడటం లేదా? ఎందుకు మౌనంగా ఉన్నారు’ అని ప్నశ్నిం చారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ట్వీట్​కు కేసీఆర్ ఫెయిల్డ్ తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్​ను యాడ్ చేశారు.