రైల్వే ప్రయాణికులకు శుభవార్త

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్న రైల్వేశాఖ…చార్జీల్లో రాయితీ కూడా కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే రైళ్లలో చార్జీలపై 25 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో రైల్వేను నష్టాల భారిన పడకుండా కాపాడుకున్నట్లు కూడా అవుతుందని భావిస్తోంది.

శతాబ్ది, తేజాస్, ఇంటర్‌ సిటీ, కొన్ని డబుల్ డెక్కర్ రైళ్లలో చెయిర్ కార్లు, ఎగ్టిక్యూటివ్ సీట్ల చార్జీలపై 25 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని రైల్వే శాఖ భావిస్తున్నాయి. ఖాళీ సీట్లతో వెళ్లకుండా మరింత మంది ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. రద్దీ తక్కువగా ఉండే రైళ్లకే ఈ రాయితీ వర్తించే అవకాశం ఉంది. ఆయా రైల్వే జోన్లకు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకే ఏ రైళ్లకు ఈ సబ్సిడీని వర్తింపచేయాలో నిర్ణయించే అధికారాన్ని వదిలేస్తారని తెలుస్తోంది. బేసిక్ ఛార్జీపైనే ఈ రాయితీ అందచేస్తారు. GST, రిజర్వేషన్ ఛార్జీ, సూపర్‌ ఫాస్ట్ టారిఫ్, తదితర ఛార్జీలను మాత్రం విడిగా వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ రద్దీతో నడిచే రైళ్లను సెప్టెంబర్ 30లోగా గుర్తించాలని అన్ని రైల్వే జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది.