హైదరాబాద్: తౌక్తే తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోనూ వర్షం పడింది. నిజాంపేట్, బాచుపల్లి, దుండిగల్, ప్రగతినగర్, కూకట్పల్లి, కూకట్పల్లి హౌజింగ్ బోర్డు, మూసాపేట్, బాలానగర్, ఫతేనగర్, మియాపూర్, చందానగర్, బీహెచ్ఈఎల్, మొయినాబాద్, చిలుకూర్, అత్తాపూర్, రాజేంద్రనగర్లో వర్షం పడుతోంది. మాన్సూన్ బృందాలను బల్దియా అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రంలో భారీ వర్షంతో కొనుగోలు సెంటర్ల దగ్గర ఒడ్ల కుప్పలు తడిసిపోయాయి. పలుచోట్ల పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అన్నదాతలు.