‘రెయిన్‌‌‌‌‌‌‌‌ బో’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

 ‘రెయిన్‌‌‌‌‌‌‌‌ బో’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

రష్మిక హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా రూపొందుతున్న ఫిమేల్ సెంట్రిక్ మూవీ ‘రెయిన్‌‌‌‌‌‌‌‌ బో’. ‘శాకుంతలం’ ఫేమ్ దేవ్‌‌‌‌‌‌‌‌ మోహన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.  శంతరుబెన్ దర్శకుడు. డ్రీమ్ వారియ‌‌‌‌‌‌‌‌ర్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎస్‌‌‌‌‌‌‌‌.ఆర్.ప్రభు, ఎస్‌‌‌‌‌‌‌‌.ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు.  తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ శనివారం పూర్తయింది. మునార్, కోడైకెనాల్‌‌‌‌‌‌‌‌లో  జరిగిన ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో రష్మిక, దేవ్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర పాత్రధారులతో ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేశారు. ఈ సందర్భంగా ‘రెయిన్ బో’ టీమ్‌‌‌‌‌‌‌‌కి థ్యాంక్యూ చెబుతూ దేవ్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌, టీమ్‌‌‌‌‌‌‌‌తో కలిసున్న ఫొటోలను రష్మిక  సోషల్ మీడియాలో షేర్ చేసింది.