అరగంట వానకే సిటీ జలమయం

అరగంట వానకే సిటీ జలమయం

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. హనుమకొండ సిటీలో దాదాపు అరగంట పాటు వాన పడగా.. చాలాచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. నాలాలు ఉప్పొంగాయి. వరద నీళ్లన్నీ రోడ్ల మీదకు చేరాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హనుమకొండలో గోకుల్​ నగర్​, తిరుమల బార్​ జంక్షన్​, శ్రీనివాస్​ కాలనీ, అశోక కాలనీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీళ్లు నిండాయి. 

హనుమకొండ తహసీల్దార్​ ఆఫీస్​ ఆవరణలోకి నీళ్లు చేరాయి. అప్పటికప్పుడు ఆఫీసర్లు జేసీబీతో డ్రైన్లు సాఫ్​ చేసే పనిలో పడ్డారు. చిన్నవాన పడినా ప్రతిసారి ఇదే సమస్య ఎదురవుతున్నది.  ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా లీడర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపించాయి.