రాష్ట్రంలో పలు చోట్ల కురుస్తున్న వాన

రాష్ట్రంలో పలు చోట్ల కురుస్తున్న వాన

రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మోస్తరు నుంచి భారీ వానలు పడుతున్నాయి. హైదరాబాద్ లో పలు చోట్ల జల్లు కురుస్తోంది. రంగారెడ్డి జిల్లా తుక్కాపూర్ లో 6.8 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. 
ఇదిలా ఉంటే ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్, ఈశాన్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే రెండు మూడ్రోజులు హైదరాబాద్ లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశముందని, ఈశాన్య జిల్లాల్లో పిడుగులతో పాటు వడగండ్లు వాన పడే ఛాన్సుందని అధికారులు చెప్పారు.