కేసీఆర్, కేటీఆర్​పై రాజాసింగ్ ఫైర్​

కేసీఆర్, కేటీఆర్​పై రాజాసింగ్ ఫైర్​

హైదరాబాద్, వెలుగు : పాతబస్తీ దాకా మెట్రో విస్తరించాలని నిరసన తెలిపితే.. ముందస్తు అరెస్టులు చేయడం ఏంటని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. బీజేపీ డిమాండ్​లో తప్పు ఏముందని ప్రశ్నించారు. జోకర్ కేటీఆర్, బట్టేబాజ్ సీఎం కేసీఆర్ అంటూ.. బుధవారం ప్రకటనలో మండిపడ్డారు. పాతబస్తీకి మెట్రోపై టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. పాతబస్తీ అభివృద్ధి చెందితే వారికి రాజకీయ భవిష్యత్ ఉండదన్న ఉద్దేశంతోనే ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయట్లేదని అన్నారు.