
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, జోధ్పూర్ మేయర్ రామేశ్వర్ దధీచ్, రాబోయే రాష్ట్ర ఎన్నికల కోసం సూర్సాగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాగా తాజాగా ఆయన తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. అంతేకాదు నవంబర్ 9న దధీచ్ బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్కు అత్యంత సన్నిహితుడు అయిన దధీచ్ 50 ఏళ్ల అనుబంధం తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోవడం గమనార్హం.
బీజేపీలో చేరిన తర్వాత..
ప్రపంచంలో భారత్ను అగ్రస్థానంలో నిలపాలని, రాజస్థాన్లో పేపర్ లీక్ వంటి కుంభకోణాలను ఆపాలన్న ప్రధాని మోదీ కోరికే బీజేపీలో చేరడానికి కారణమని దధీచ్ అన్నారు. "ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాత్మక సామర్థ్యం కారణంగా నేను బీజేపీలో చేరాను. చాలా కాలంగా ఆయన చేస్తున్న పనులతో ఆకట్టుకున్నాను. మోదీ ప్రధాని కాకపోతే, రామ మందిర నిర్మాణం (ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో) జరగేది కాదు" అని కాషాయ పార్టీలో చేరిన తర్వాత దధీచ్ అన్నారు.
Also Read :- బీఆర్ఎస్ను బొంద పెట్టండి: బాలసాని లక్ష్మీనారాయణ
బీజేపీ స్పందన
ఈ పార్టీల విధానాలు, నెరవేర్చని హామీల పట్ల అసంతృప్తితో కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీల నేతలు బీజేపీలోకి ఫిరాయిస్తున్నారని కేంద్రమంత్రి షెకావత్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిష్క్రమించే సమయం ఆసన్నమైందని ఆయన ఉద్ఘాటించారు. "ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ కుటుంబమైన బీజేపీ, శక్తివంతమైన వ్యక్తుల చేరికతో అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రస్తుత ఎన్నికలలో, కాంగ్రెస్ ప్రభుత్వం పోతుందని ప్రజలకు తెలియగానే, వారి సీనియర్ నాయకులు చాలా మంది బీజేపీలో చేరడం కొనసాగిస్తున్నారు" అని ఆయన అన్నారు.
VIDEO | "BJP, the world's biggest political family, continues to grow and prosper with the inclusion of powerful people. In the current elections, when people know that the Congress government is going out, several of their senior leaders continue to join the BJP," says Union… pic.twitter.com/hmBlGiWegF
— Press Trust of India (@PTI_News) November 9, 2023