హుడా సెంచరీ.. విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌‌ ఫైనల్లో రాజస్తాన్

హుడా సెంచరీ.. విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌‌ ఫైనల్లో రాజస్తాన్

రాజ్‌‌కోట్:  దీపక్ హుడా (128 బాల్స్‌‌లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 180) భారీ సెంచరీతో విరుచుకుపడటంతో విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌‌లో  రాజస్తాన్ ఫైనల్ చేరుకుంది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో కర్నాటకను ఓడించింది. తొలుత కర్నాటక నిర్ణీత 50 ఓవర్లలో 282/8 స్కోరు చేసింది.

అభినవ్ మనోహర్ (91), మనోజ్ భాంగడే (63) రాణించారు.  అనికేత్ చౌదరి, అజయ్ సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం హుడాకు తోడు కరణ్ లాంబా (72 నాటౌట్) జోరుతో రాజస్తాన్ 43.4 ఓవర్లోనే 283/4 స్కోరు చేసి గెలిచింది. హుడాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. శనివారం జరిగే ఫైనల్లో హర్యానాతో రాజస్తాన్‌‌ అమీతుమీ తేల్చుకోనుంది.