- ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం నేపథ్యంలో ఆంక్షలు
- 9 నెలల పాటు అమలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫామ్రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి 9 నెలల పాటు రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుంచి బాలంరాయ్ మధ్య రోడ్డును రెండు వైపులా బంద్ చేయనున్నారు. ఈ క్రమంలో చుట్టుపక్కల రోడ్లు , జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, దీన్ని గమనించాలని సిటీ ట్రాఫిక్జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ తెలిపారు.
బాలానగర్ నుంచి పంజాగుట్ట వైపు, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలు.. తాడ్బండ్ – మస్తాన్ కేఫ్ – డైమండ్ పాయింట్ – మడ్ ఫోర్ట్ – ఎన్సీసీ – జేబీఎస్– ఎస్బీఐ రోడ్డులో వెళ్లొచ్చు. సుచిత్ర నుంచి పంజాగుట్ట వైపు అలాగే, ట్యాంక్ బండ్ వెళ్లే వాహనాలు..సేఫ్ ఎక్స్ప్రెస్– బాపూజీ నగర్ – సెంటర్ పాయింట్ – డైమండ్ పాయింట్–మడ్ఫోర్ట్–ఎన్సీసీ–జేబీఎస్– ఎస్బీఐ రోడ్లను ఎంచుకోవాలి.
ట్యాంక్ బండ్– రాణీగంజ్, పంజాగుట్ట– రసూల్పురా – ప్లాజా నుంచి తాడ్బండ్ వెళ్లే వాహనాలు సిటీఓ జంక్షన్ దగ్గర రాజీవ్ గాంధీ స్టాచ్యూ జంక్షన్లో మలుపుకుని అన్నా నగర్ – బాలంరాయి– తాడ్బండ్ రోడ్డులో వెళ్లాలి. అన్నా నగర్ లో ఉండే వారు పంజాగుట్ట, ట్యాంక్ బండ్ వైపు వెళ్లాలంటే.. మీటింగ్ పాయింట్ బైలేన్, హాకీ గ్రౌండ్ బైలేన్, పోలీస్ స్టేషన్ బైలేన్ల ద్వారా వెళ్లాలి.
రాజీవ్ గాంధీ స్టాచ్యూ జంక్షన్ వైపు రాంగ్రూట్లో వెళ్లవద్దని , ప్రజలు ఈ డైవర్షన్లను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని జాయింట్ సీపీ కోరారు.
